ఎమ్మెల్యే చేతుల మీదగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ

Published: Thursday January 20, 2022

కోరుట్ల, జనవరి 19 ( ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుదవారం రోజున కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లబ్ధి దారులకు అందచేశారు. కోరుట్ల మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు 93, షాది ముభారక్ చెక్కులు 65, మొత్తం 158 లబ్ధి దారులకు చెక్కులను అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ప్రతి ఆడబిడ్డకు అండగా వుంటున్నారు. కరోనా కష్టకాలం లో కూడా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి,షాది ముబరాక్ పథకాలను అందచేశారని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో లబ్ధి దారుల ఇంటి వద్దకే నేరుగా చెక్కులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎం.పి.పి తోట నారాయణ, జెడ్.పి.టీ.సి ధారిషెట్టి లావణ్య రాజేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చిటి వెంకట్రావు,జిల్లా సర్పంచ్ల పోరం అధ్యక్షులు ధారిషెట్టి రాజేష్, మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, కోరుట్ల పట్టణ కౌన్సిలర్స్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటిసి, సింగిల్‌ విండో అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు