జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ. చేసిన పిల్లి రవి వర్మ. బూర్గంపాడు ( ప్రజా పాలన.)
Published: Monday November 14, 2022
బూర్గంపాడు మండలంలోని కృష్ణ సాగర్ గ్రామంలో జాతీయ మాలమహానాడు బూర్గంపాడు మండల అధ్యక్షుడు, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ పిల్లి రవి వర్మ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు బూర్గంపాడు మండల అధ్యక్షుడు పిల్లీ రవి వర్మ మాట్లాడుతూ నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన దాతలు జయరాజు ఫాదర్, బి సునీల్, ఆర్ఎంపి గోవింద్, ఎస్ కే యాకోబ్ కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల ఉప్పలయ్య, జయరాజు, వెంకటేశ్వర్లు, రాజు, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: