రాష్ట్రపతి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకుడు జంపాల రవి ఆధ్వర్యంలో

Published: Friday July 29, 2022
బోనకల్, జూలై 28 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ ఆదేశాలు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం జిల్లా ఓబీసీ జిల్లా కార్యదర్శి జంపాల రవి ఆధ్వర్యంలో జరిగింది.
బుధవారం జరిగిన పార్లమెంట్ లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఎంపీ అదీర్ రంజన్ చౌదరి ఈ దేశ ప్రథమ పౌరురాలు అయినటువంటి 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అదిర్ రంజాన్ చౌదరి, సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి , యువ నేత బీపీ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ,సోనియాగాంధీ ఆదివాసీ గిరిజనుల పట్ల క్షమాపణలు చెప్పాలని అదీర్ రంజన్ చౌదరిని సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ మరింత ఆందోళన ను ఉదృతం చేస్తామని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షులు కాలసాని పరశురామ్, ఎస్టిమోర్చా మండల అధ్యక్షుడు భూక్య సైదా నాయక్ , సైదులు, భరత్, ఉపేంద్ర, సైదా, ప్రభాకర్, గోపి, రమేష్ నాయక్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area