రేగుంట ఉన్నత పాఠశాలలో వసంత పంచమి ఉత్సవాలు

Published: Wednesday February 17, 2021
మల్లాపూర్, ఫిబ్రవరి 16 ( ప్రజాపాలన ): మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు  వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ లో ఉన్న సరస్వతి మాత విగ్రహానికి పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. తొమ్మిదో తరగతి, పదోవ తరగతి విద్యార్థులతో ఉపాధ్యాయులు సరస్వతి స్లోక పఠనం జరిపించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి.గనేందర్, ఉపాధ్యాయులు పి.సుప్రియ, రాంరెడ్డి, హనుమంతరావు, నర్సయ్య, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.