లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలి

Published: Wednesday June 02, 2021
బీరుపూర్, జాన్ 1 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలోని రైతులు లైసెన్సు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని బిల్లులపై డీలర్ల సంతకం మరియు రైతుల సంతకాలు తప్పకుండ ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారిణి జె.అనూష రైతులకు తెలియజేశారు. నాణ్యమైన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని గ్రామాల్లో తిరుగుతూ లైసెన్స్ లేకుండ అమ్మే మధ్యవర్తుల వద్ద కోని రైతులు మోసపోవద్దని వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. బీ1మరియు బీ3 అని పిలువబడే విత్తనాలను ప్రభుత్వ అనుమతి లేదు. ఇలాంటి విత్తనాలు అమ్మినవారిపై కొన్నవారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని రైతులు జాగ్రత్తలు పాటించాలని అనూష తెలిపారు.