బీరుపూర్ మండలంలో అభివృద్ధి పనులపై పీడీ వినోద్ కుమార్ పర్యటన

Published: Wednesday October 06, 2021
బీరుపూర్, అక్టోబర్ 05 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని కొల్వాయి మంగేల కమ్మునూర్ తదితర పల్లెప్రగతి పనులైన వైకుంఠ ధామం క్రిమిటోరియా నర్సరీ హరితహారం డంపింగ్ యార్డ్ తదితర అభివృద్ధి పనులను డి.ఆర్.డి.వో పీడి వినోద్ కుమార్ పర్యటించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పాత పద్మ వైస్ ఎంపీపీ భలుమురి లక్ష్మణ్ రావు ఎంపీడీఓ మల్లారెడ్డి కొల్వాయి సర్పంచు మేసు ఏసు ఎంపీటీసీ రంగు లక్ష్మణ్ మంగేల సర్పంచ్ చుంచు శారద కమ్మునూర్ సర్పంచ్ బందెల మరియా ఎంపీవో రాజు ఏపీవో సుజన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.