రేషన్ కార్డుల పంపిణి చేసిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Published: Tuesday July 27, 2021
పరిగి, 26 జులై, ప్రజాపాలన ప్రతినిధి : దోమ మండల వాసులకు 483 నూతన రేషన్ కార్డులు మంజూరు కావడంతో సోమవారం దాదాపు 300/ పైగా లబ్ధిదారులకు వికారాబాద్ జిల్లా పరిగిలోని బృందావన్ గార్డెన్లో జిల్లా కలెక్టర్ పౌసమి బసు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి చేయడం జరిగిందని దోమ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కె రాజిరెడ్డి తెలిపారు. మిగతా వారు దోమ తహసీల్దార్ కార్యాలయంలో కానీ మీసేవలో కానీ నూతన కార్డులు తీసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ వైస్ ఎంపీపీ మల్లేశం జిల్లా గ్రంథాలయ శాఖ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్ పార్టీ మాజీ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి నవాజ్ రెడ్డి పంచాయతీ వార్డ్ సభ్యులు లక్ష్మణ్ పాల్గొన్నారు.