రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తుమ్మల నాగేశ్వరరావు..
Published: Monday January 16, 2023
తల్లాడ, జనవరి 14 (ప్రజా పాలన న్యూస్):
తల్లాడ మండలంలోని అంజనాపురం మాజీ సర్పంచ్, ఎంపీటీసీ గురిజాల రామారావు విగ్రహాన్ని రాష్ట్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. శనివారం రామారావు దశదిన కర్మ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని తుమ్మల ప్రారంభించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కోసం రామారావు ఎనలేని కృషిచేసి ప్రజల మన్నలను పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, దుండే టి వీరారెడ్డి, పాసంగులపాటి లక్ష్మీనారాయణ, సర్పంచ్ కొమ్మినేని విద్యాసాగర్, ఎంపీటీసీలు కొమ్మినేని ప్రభాకర్ రావు, దగ్గుల రఘుపతి రెడ్డి, అనూమోలు వెంకటేశ్వరరావు, మారేళ్ళ లక్ష్మణరావు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, రాంబాబు, కేతినేని హారీష్, సరికొండ అప్పలరాజు, ఆనుమోలు నాగేశ్వరరావు, తాత భాస్కరరావు, పులి కృష్ణయ్య, గురుజాల వెంకటయ్య, దలాంశెట్టి శ్రీనివాసరావు, పైడిపల్లి రవి, గోవిందు శ్రీను తదితరులు హాజరై ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Share this on your social network: