గోళ్లకేతమ్మను దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే సంజయ కుమార్

Published: Wednesday March 01, 2023

బీరుపూర్, ఫిబ్రవరి 28 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రంగాసాగర్ రాయికల్ మండల్ కట్కాపూర్ గ్రామాల మధ్య ఉన్న గొల్లకేతమ్మ ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే డా:  సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి సిడిపి నిధులు ద్వార 4.80 లక్షల మంజూరు చేయగా గొల్ల కేతమ్మా ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పాల రాంచందర్ రావు కొలుముల రమణ నారపాక రమేష్ బీర్పూర్ రాయికల్ మండల ముఖ్య నాయకులు సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.