కందేనకుంట బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం...
Published: Tuesday March 16, 2021
బీరుపూర్, మర్చి 15 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం కందేనకుంట గ్రామానికి చెందిన బద్ది వెంకటేష్ గుడిసె గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి దగ్దం అయిన సంగతి తెలిసిందే. ధర్మారం మండలం కొత్తుర్ గ్రామానికి చెందిన ప్రస్తుతం కెనడాలో ఉద్యోగం చేస్తున్న కొలుముల దామోదర్ తన వంతుగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నరసింహులపల్లి గ్రామ సర్పంచ్ రిక్కల ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల సురేష్ మెరుగు వేణు జుంజూరు రమేష్ మంద మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: