వీఆర్ఏల పేస్కేల్ జాతర - బోనాల ఊరేగింపు
Published: Wednesday August 24, 2022
ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 30 రోజులుగా కొనసాగుతున్న విషయం విధితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వి ఆర్ ఏ జె ఏ సి కో కన్వినర్ వై వెంకటేష్ యాదవ్ , రంగ రెడ్డి జిల్లా చైర్మన్ ఎడ్ల వెంకటేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి యత భాస్కర్, జిల్లా కన్వీనర్ ప్రసాద్, ఇబ్రహీంపట్నం డివిజన్ వి ఆర్ ఏ జె ఏ సి చైర్మన్ బుద్ధి రాజేష్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మండల అధ్యక్షులు ఇబ్రహీంపట్నం కర్ణేశ్వర్ , యాచారం యార జంగయ్య, అబ్దుల్లాపూర్ మెట్టు ప్రశాంత్, మంచాల పండి నాగరాజ్, వి ఆర్ ఏ లు పాల్గొని
విన్నూత రీతిలో పే స్కేల్ జాతర- బోనాల ఊరేగింపు
కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అదేవిధంగా
రంగారెడ్డి జిల్లా బద్వేల్ ఎక్స్ రోడ్ నుండి రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలుపడం జరిగిందని వీఆర్ఏ జేఏసీ నాయకులు తెలిపారు.
విన్నూత రీతిలో పే స్కేల్ జాతర- బోనాల ఊరేగింపు
కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అదేవిధంగా
రంగారెడ్డి జిల్లా బద్వేల్ ఎక్స్ రోడ్ నుండి రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలుపడం జరిగిందని వీఆర్ఏ జేఏసీ నాయకులు తెలిపారు.
Share this on your social network: