చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయండి **

Published: Saturday December 17, 2022
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిరాం **
 
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 21వ తేదీన ఖమ్మం లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు పోల్కర్ సాయిరాం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా పోల్కర్ సాయిరాం మాట్లాడుతూ ఈనెల 21న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లో సర్దార్ పటేల్ కేడియం లో నిర్వహించడం జరుగుతుందని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రజలు అధిక సంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఆసిఫాబాద్ జిల్లా నుండి ప్రజలు కార్యకర్తలు చంద్రబాబు మీటింగ్ కు రావాలని కోరారు. తెలంగాణ ప్రాంతమును అన్ని విధాల అభివృద్ధి చెందిన ఘనత టిడిపిదే అని అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.