టిడిపి మండల కన్వీనర్ గా రెండవసారి ఎన్నికైన రావుట్ల

Published: Friday March 03, 2023
బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన రావుట్ల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు.ఇప్పటివరకు మండల అధ్యక్షుడు గా కొనసాగిన రావుట్ల ఇటీవల నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడు గా ఎన్నికైన కాసాని జనేశ్వర్ అన్ని జిల్లా ల కమిటీలను రద్దుచేసి మండలాలకు కన్వీనర్ లను నియోజకవర్గ లకు కో ఆర్డినేటెట్ లను జిల్లా స్థాయిలో ఆబీజర్వేర్ లని నియమించిన నేపథ్యంలో బోనకల్ మండల కన్వీనర్ గా తిరిగి రావుట్ల ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రావట్ల సత్యనారాయణ మాట్లాడుతూ తనకు మరొకసారి కన్వీనర్ గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కు, ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లకు ,మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథంకు, జిల్లా నాయకులకు మండల నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 1982 సంవత్సరం పార్టీ స్థాపించిన నాటి నుండి పార్టీలో కొనసాగుతూ నిబద్ధతో పనిచేస్తూ క్రమశిక్షణ గల నాయకుడిగా, మండలంలో పార్టీని, అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలాన్ని ప్రథమ స్థానంలో నిలుస్తూ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్న రావుట్లకు మరొకసారి కన్వీనర్ గా అవకాశం ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.