కాలనీ బస్తీల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి

Published: Friday April 30, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 29, (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా చిలుకా నగర్ డివిజన్లో పలు కాలనీలు, బస్తీలు  మరియు దేవాలయాల్లో స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ హైపోక్లోరైడ్ ద్రావాణాన్ని పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి,బింగి శ్రీనివాస్, శ్యామ్ కుమార్, రాము, శివ రామ రాజు, శశి, వికాస్, మరియు పలు కాలనీలలో అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.