రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి

Published: Monday May 02, 2022
అదిలాబాద్ డీసిసి వర్కింగ్ ప్రజిడెంట్ వెడమ బొజ్జు
జన్నారం రూరల్, మే 01, ప్రజాపాలన: ఈ నెల 6న వరంగల్ జిల్లాలో నిర్వహించే (రైతు సంఘర్షణ సభ) రాహుల్‌ గాంధీ బహిరంగ సభకు అధిక సంఖ్య లో కాంగ్రెస్‌ కార్యకర్తలు హాజరై విజయ వంతం చేయాలని ఆదిలాబాద్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడమ బొజ్జు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై, ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, నిరుద్యోగులను మోసం చేస్తున్న తీరు వంటి అంశాలపై ప్రస్తావిస్తారన్నారు. ఈ బహిరంగ సభ కు జిల్లా, మండలాల నుండి భారీ ఎత్తున రైతులు పాల్గొనాలని కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని, యాసంగి వడ్లు కొనకుండా బీజేపీ టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి ఫసీ ఉల్లా, జిల్లా కార్యదర్శులు మోహన్ రెడ్డి, ముత్యం రాజన్న, మండల వైస్ ప్రెసిడెంట్ అంబడిపెళ్లి మహేష్, బీసీ సెల్ అధ్యక్షుడు బీనవేని రాజన్న, వార్డు నెంబర్ గంగన్న, మండల కార్యదర్శి లకావత్ తిరుపతి, మైనార్టీ అధ్యక్షుడు వాసీమ్ పటేల్, సీనియర్ నాయకులు అల్లం లచ్చన్న, నర్సింగ్ రావ్, ప్రచార కార్యదర్శి అజార్, యూత్ కాంగ్రెస్ నాయకులు ముజ్జు, హేమంత్ చారి తదితరులు పాల్గొన్నారు.