ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి

Published: Wednesday April 19, 2023
* వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య
వికారాబాద్ బ్యూరో 18 ఏప్రిల్ ప్రజా పాలన : వేసవికాలంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పనులు ఆర్థిక ఆదాయాన్ని చేకూరుస్తోందని వికారాబాద్ ఎంపిడిఓ మల్గ సత్తయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపిడిఓ మల్గ సత్తయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు చెక్ డ్యాములలో పూడికతీత పనులు  ముమ్మరంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. మొత్తం 1085 మంది కూలీలు ఉపాధి హామీ పనులలో నిమగ్నమయ్యారని వివరించారు.
కొలతల ప్రకారము  ఒక్కొక్కరికి 270 రూపాయలు వచ్చే విధంగా పనులు  సక్రమంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య టెక్నికల్ అసిస్టెంట్ నర్సింలు పంచాయతీ సెక్రెటరీ రాములు ఎంపీ ఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.