నరసింహులపల్లి శ్రీ భలరామకృష్ణ యాదవ సంఘం ప్రమాణ స్వీకారం...

Published: Thursday October 07, 2021
బీరుపూర్, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ నరసింహులపల్లి గ్రామంలో శ్రీ భలరామకృష్ణ యాదవ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకోని సంఘాన్ని కూడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మంగళవారం రోజున సాయంత్రం సంఘం అధ్యక్షునిగా అన్నం రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా గొర్ల ప్రశాంత్ ఉపాధ్యక్షుడిగా కటికరెడ్డి సతీష్ కోశాధికారి గొడుగు మధుసూదన్ కమిటీ సభ్యులు లింగాల మహేష్ జంగిలి మల్లేష్ సుంచు మల్లేష్ సుధా నరేందర్ గొట్టె అంజన్న గుడిసె చంద్రప్రకాష్ ఎడ్ల నారాయణ సంఘ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అధ్యక్షడు కార్యదర్శి సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా స్థానిక ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ భలరామకృష్ణ యాదవ సంఘ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు అంకిత భావంతో పని చేసి సంఘం అభివృద్ధికి ఆర్థికంగా సామాజిక నైతిక విలువలకు లోబడి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని తీర్మానం చేశారు.