జాతీయస్థాయి సహకార సంఘాల సమావేశాలకు హాజరైన సొసైటీ అధ్యక్షులు కటికల

Published: Tuesday September 27, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 26 నాబార్డ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో సోమవారం సహకార సంఘాల జాతీయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి ఖమ్మం జిల్లా సిద్ధినేనిగూడెం సహకార సంఘం అధ్యక్షులు కటికల సీతారామరెడ్డి హాజరయ్యారు. సహకార సంఘాలు బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ఆరు రాష్ట్రాలకు చెందిన సహకార సంఘాలకు చెందిన చైర్మన్లు అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఖమ్మం జిల్లా సిద్ధినేనిగూడెం సహకార సంఘం అధ్యక్షులు కటికల సీతారామరెడ్డి హాజరై పలు సూచనలు చేశారు.20 ఏళ్లుగా సహకార సంఘాల్లో బదిలీలు లేవని, వెంటనే బదిలీలు చేపట్టాలని ఆయన కోరారు. రైతుల నుండి డిసిసిబి బ్యాంకులు 10 శాతం వసూలు చేస్తున్న షేర్ క్యాపిటల్ను ఐదు శాతానికి తగ్గించాలని ఆయన పేర్కొన్నారు.