డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి కార్పొరేటర్ చేతన హరీష్

Published: Thursday July 28, 2022
మేడిపల్లి, జూలై27 (ప్రజాపాలన ప్రతినిధి)
 హబ్సిగూడ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేటర్ జలమండలి, మున్సిపల్ అధికారులతో కలిసి డివిజన్లోని రాంరెడ్డి నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోరకు పర్యటించారు. రాంరెడ్డి నగర్లో గల  డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అవుట్ లైట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవుట్ లైట్ పైపు లైనును రాంరెడ్డి నగర్ వీధి నంబర్ 8 దగ్గర నాల అవతల కలపాడానికి సాధ్యాసాధ్యాలు పరిషిలించాలని అధికారులకు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జిఎం జాన్ షరీప్, సిజిఎం   సుజాత, ఎస్టిపి డీజీఎం రాజ్ కుమార్, జిహెచ్ఎమ్ సి ఈఈ నాగేందర్, డిఈ నాగమణి, ఏఈ కీర్తీ శ్రీ, వాటర్ వర్క్స్ ఏఈ రవీందర్, బిజెపి నాయకులు సంజయ్ పటేల్, ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, తదితరులు పాల్గొన్నారు.