కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ **

Published: Saturday August 27, 2022
ఆసిఫాబాద్ జిల్లా, ఆగస్టు 26, ప్రజాపాలన, ప్రతినిధి :
 
 ఆగస్టు 28న  నిర్వహించబోయే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాల్లో 6722 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్టు తెలిపారు. ఆసిఫాబాద్ లో 12 పరీక్ష కేంద్రాల్లో 3266 మంది, కాగజ్ నగర్ లో 11 పరీక్ష కేంద్రాల్లో 3456 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. పరీక్ష ఉదయం10 గంటల నుండి, మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించబడుతుందని, విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 9 గంటలకే చేరుకోవాలన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు విద్యార్థులు మాస్కు ధరించాలని, సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.