శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం చైర్మన్, కమిటీ సభ్యులకు అభినందనలు

Published: Tuesday February 09, 2021

మధిర సిద్ధి వినాయక స్వామి దేవాలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం మరియు మృత్యుంజయ స్వామి దేవాలయం (శివాలయం) పాలకమండలి కమిటీలకు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిరియాల సీతారామయ్య, దొడ్డా మురళీకృష్ణ మరియు వంకాయలపాటి నాగేశ్వరరావు చైర్మన్లు గాను మరియు వారి కమిటీ సభ్యులకు మధిర ఆర్యవైశ్య ప్రముఖులు ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అధ్యక్షులు కపిలవాయి జగన్ మోహన్ రావు, కపిలవాయి భరణి, శ్రీ వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల నరసింహమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ డోకుపర్తి సత్యంబాబు, టిఆర్ఎస్ టౌన్ కమిటీ అధ్యక్షులు దేవిశెట్టి రంగారావు, కనుమూరు వెంకటేశ్వరరావు, కురువెళ్ళ వెంకట పురుషోత్తమరావు, లిటిల్ హార్ట్స్ అధినేత భువనగిరి నారాయణరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బంజారా కాలనీ అధ్యక్షులు గొండేల ముత్తయ్య గారు, చేడే రామకోటేశ్వరరావు గారు మరియు స్వామి అయ్యప్ప దేవాలయం అధినేత చలువాది శ్రీనివాసరావు గారు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు