పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలి

Published: Wednesday March 29, 2023
 జన్నారం, మార్చ్ 28, ప్రజాపాలన: ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా వ్రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పందిరి మనీష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మంచిగా చదివి 10/10 జిపిఎస్ సాధించే విధంగా విద్యార్థులు పరీక్షలు రాయాలని ఆయన కోరారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వట్టలు, పెన్నులు, పెన్సిల్లు, ఇతరేత్ర సామాగ్రిని వెంట తీసుకొని వెళ్లి పరీక్షలు రాసే సమయంలో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, 10వ తరగతి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, పాల్గొన్నారు.