సి సి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన జడ్పీ వైస్ చైర్మన్

Published: Wednesday February 09, 2022
బెల్లంపల్లి, ఫిబ్రవరి 8, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామపంచాయతీ మన్నెగూడెంలో 6 లక్షల రూపాయల గ్రామపంచాయతీ నిధులతో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్డు పనులను మంగళవారం మంచిర్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తోంగల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రతి గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో సిసి రోడ్లు నిర్మించు కోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణతో పాటు, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మాజీ చంద్రవెళ్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ శ్రీ సింగతి పెద్దన్న, గ్రామసర్పంచ్ నిర్మల, వార్డుసభ్యులు, ఏ ఇ పరంజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.