మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల

Published: Tuesday September 27, 2022
బోనకల్, సెప్టెంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని జానకిపురం ,రావినూతల గ్రామాలలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా జానకిపురం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన చిలకా వెంకటరత్నం దిశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం రావినూతల గ్రామంలో చేబ్రోలు రామారావు సతీమణి సీతమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టిఆర్ఎస్ కార్యకర్త భానోత్ కృష్ణ స్వల్ప అస్వస్థతో ఉండడంతో వారిని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, టిఆర్ఎస్ నాయకులు వేమూరి ప్రసాద్, రంగా హనుమంతరావు, వెనిగండ్ల మురళి, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, జెడి మూర్తి, బానోతు కృష్ణ,వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరైనారు.