నాల విస్తరణ అభివృద్ధి పనుల గురించి అధికారులతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సమీక్ష

Published: Saturday October 09, 2021
మేడిపల్లి, అక్టోబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ మున్సిపల్ పరిధిలోని ఉన్న నాలలనూ, కాల్వలను అభివృద్ధి పరిచేందుకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన నివాసంలో నాల విస్తరణ అభివృద్ధి పనుల గురించి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బినగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అరుణ కుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్, టి.పి.ఎస్.మౌనిక, డీ.ఈ.నిఖిల్ రెడ్డి, ఏ.ఈ.వసంత, ఇతర అధికారులు పాల్గొన్నారు.