అట్లూరి వీరారెడ్డి సేవలు మరువలేనివిసాక్షి సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నామా

Published: Monday June 27, 2022

మధిర జూన్ 26 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు సాక్షి  ఆర్సి ఇంచార్జ్ సాంబరెడ్డి తండ్రిఅట్లూరి వీరారెడ్డి సేవలు మరువలేనివని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సాక్షి మధిర ఆర్సి ఇంచార్జి అట్లూరి సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల అట్లూరి సాంబ రెడ్డి తండ్రిగారు వీరారెడ్డి మృతి చెందారు. దీంతో సాంబి రెడ్డి కుటుంబాన్ని వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు టిఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాది వాసు కనుమూరు వెంకటేశ్వరావు అరిగే శ్రీనివాసరావు వైవి అప్పారావు జెవి రెడ్డి సాక్షి సాంబి రెడ్డి సోదరులు గంపలగూడెం మండలం కనుమూరు గ్రామపంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అట్లూరి వెంకట కృష్ణారెడ్డి  పిఆర్ టియు ఉపాధ్యాయ సంఘం గంపలగూడెం మండల ప్రధాన కార్యదర్శి అట్లూరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు