మహిళల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ... ఎంపీపీ మాదాడి సరోజన .

Published: Monday March 13, 2023

జన్నారం, మార్క్ 12, ప్రజాపాలన:  మహిళల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి జరుగుతుందని మండల ఎంపీపీ మాదాడి సరోజన అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని రామాలయం వాడలో ఏర్పాటుచేసిన ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా ఐద్వా మహిళ సంఘం అధ్యక్షురాలు పోతు విజయ శంకర్,మండల కేంద్రంలో  ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ మాట్లాడుతూ మహిళల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, విద్యార్థినులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలలో నిలవాలని, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపీడీవో అరుణ రాణి, వ్యవసాయ అధికారి త్రిసంధ్య, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారాలు, మండల మహిళా అధ్యక్షురాలు సుశీల, కాంతామణి మండలంలోని గ్రామపంచాయతీ మహిళ సర్పంచులు, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులు విద్యలో రాణించి అన్ని రంగాలలో ముందుండాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని, లక్ష్యసాధన కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి శంకర్ రవి, మహిళా నాయకులు, రాజేశ్వరి, పీ విజయ, తదితరులు పాల్గొన్నారు.