మధిర మండల కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్

Published: Friday July 23, 2021
మధిర, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ప్రదేశ్్్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కోక పెట భూముల వేలం కి నిరసనగా రాజభవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను మధిర రూరల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్ కు తరలించారు. అరెస్టయినవారిలో సైదేల్లిపురం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు రొంపి మల్ల సర్పంచ్ ఎస్.కె మదర్ సాహెబ్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు మండల నాయకులు ఐల్లూరి సత్యనారాయణ రెడ్డి రామకృష్ణ, జాలిముడి సర్పంచ్ ప్రభాకర్, మాటూరు కాంగ్రెస్ నాయకులు కోలా శంకర్ గారు, బొర్రా శ్రీనివాసరావును అరెస్ట్ చేసి పోలీస్టేషన్ లో ఉంచారు ఈ సందర్భంగా పులికొండ చిట్టిబాబు మాట్లాడుతూ ఈ ప్రబుత్వం వారి ఇష్టానికి భూములు వారి అనుకూల వారికి అమ్మడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం రాబోయే కాలంలో సామాన్య ప్రజలే  రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు బుద్ధి చెప్తారు అని వారన్నారు అలాగే కెసీఆర్ పాలన రాచరికపు పాలను తలపిస్తుంది అని ప్రశ్నించే గొంతును నొక్కి వేయాలని చూస్తూ ఒక నియంత హిట్లర్ లా పాలన చేస్తున్నారని, ఇంకా ఎంతకాలము ఈ అరాచకాలు సాగవు కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చింది