ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన ఆస్పత్రి సిబ్బంది

Published: Friday September 30, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: సింగరేణి కార్మికులకు లాభాల వాటా 30% ప్రకటించి మొదటి తేదీన ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రపటానికి  బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సిబ్బంది గురువారం పాలాభిషేకం చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు, 31 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గెళ్ళి రాజాలింగు మాట్లాడుతూ,
 సింగరేణి  సంస్థ గత ఆర్థిక సంవత్సరం సాధించిన 1227 కోట్ల నుండి లాభాలవాటగా 30%  368 కోట్లను  కార్మికులకు లాభాలవాట రూపంలో ఇవ్వాలనినిర్ణయించి నందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం చేశామని తెలిపారు. 
 ఈ కార్యక్రమంలో  ఏరియా ఆసుపత్రి ఫిట్ కార్యదర్శి అనుముల  సత్యనారాయణ, అసిస్టెంట్ ఫీట్ కార్యదర్శి దండబోయిన భాస్కర్, రసరంజని కుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ధారా స్వరూప రాణి, సొకాల శ్రీనివాస్, మరియు నాయకులు అరుణసుందరి, గుమాస తిరుపతి, గూడూరు కృష్ణ, కుంట ప్రకాష్, లిఖిత, సదాలక్ష్మిలు,తదితర ఏరియా ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.