సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

Published: Friday February 04, 2022
క్యాతనపల్లి. పిబ్రవరి 03, ప్రజాపాలన ప్రతినిధి : రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు బుధవారం ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఇ మిట్టపల్లి శ్రీనివాస్ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి పూర్తి చేయలేదన్నారు. ముఖ్యంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి  చేయలేదు. సింగరేణి ప్రాంతంలో పేదవారు ఇల్లు నిర్మించుకుని ఉన్న వారికి పట్టాలు ఇస్తామని డీడీలు కట్టించుకుని ఏ ఒక్కరికి ఇవ్వకుండా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నారు. అని అంతేకాకుండా స్మశాన వాటిక లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే గాని స్థానిక ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదన్నారు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఎనిమిది సంవత్సరాలు అవుతున్న ఏ ఒక్కరికి ఇవ్వలేదన్నారు ఎప్పుడు ఇస్తారో అని డిమాండ్ చేశారు వీటితో పాటు స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ. మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఇప్పకాయల లింగయ్య. జిల్లా సమితి సభ్యులు వనం సత్యం. ఏఐటియుసి నాయకులు కాదండి సాంబయ్య. ఎం.డి హుస్సేన్. గోవిందులు. రమేష్. కొమురయ్య. తదితరులు ప్రజలు పాల్గొన్నారు.