గ్రామపంచాయతీలు అభివృద్ధి పనులు పకడ్బందీగా చేపట్టాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday December 29, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 28 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
 
గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంచాయతీలో వివిధ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంచాయతీలో చేపడుతున్న పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కు సంబంధించి మొక్కలు సిద్ధం చేయాలన్నారు. క్రీడా ప్రాంగణంలో వసతులు కల్పించాలన్నారు రోడ్డుకిరువైపుల నాటిన ఎవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ గవర్నెన్స్ కింద సరైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయి, డిఆర్డిఓ సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, ఏపీడి కుటుంబరావు, రిసోర్స్ పర్సన్లు ఆంజనేయులు, ఫణికుమార్, రజనీకాంత్ పాల్గొన్నారు.