పాదయాత్ర విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ

Published: Tuesday March 30, 2021
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలో ఏప్రిల్ 2వ తేదీన మొదలయ్యే జన చైతన్య పాదయాత్ర జయప్రదం చేయాలని కోరుతూ సోమవారము పార్టీ కార్యాలయంలో పోషణ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేముల మహేందర్,మండల కార్యదర్శి మద్దెల రాజయ్యలు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సాగు త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, భూసమస్య, కాలుష్యం, సంక్షేమం, ప్రజా సమస్యల సాధనకై జరిగే పాదయాత్ర మండలంలో రెండవ తేదీ సాయంత్రం సంగం, వర్క్ ట్పల్లి, గోకారం మూడవ తేదీ ఉదయం జాలు కాలువ, గొల్లపల్లి, నెమలికాలువ నాగారం 12 గంటలకు వలిగొండ భోజనానంతరం మల్లెపల్లి, వెల్వర్తి, మొగిలిపాక చేరుకుంటుందన్నారు. నాలుగవ తేదీ ఉదయం కదిరిగూడెం, కెర్చిపల్లి, వీర్ల గడ్డ, సుంకిశాల, పులిగిల్ల కు చేరుకుంటుందని తెలిపారు. ఈ గ్రామాలలో జరిగే పాదయాత్రలు పార్టీ సభ్యులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజలు అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణలో కల్పూరి రామచంద్ర, గరిదాసు నరసింహ, కవిడే సురేష్, వడ్డెబోయిన వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.