ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
Published: Friday September 03, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోనీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ప్రజలు ఎప్పటికి మరవ లేరని ప్రజల హృదయాల్లో నిలిచిన ముఖ్యమంత్రి వైయస్సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ రాజ్, నాయకులు బోల్ల శ్రీనివాస్, పలుసం సతీష్, కాసుల వెంకన్న, సురేందర్, తిరుపతి, వెంకటేష్, రమేష్, సాయి, ధనంజయ, రాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: