ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు

Published: Friday September 03, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోనీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు ప్రజలు ఎప్పటికి మరవ లేరని ప్రజల హృదయాల్లో నిలిచిన ముఖ్యమంత్రి వైయస్సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్ రాజ్, నాయకులు బోల్ల శ్రీనివాస్, పలుసం సతీష్, కాసుల వెంకన్న, సురేందర్, తిరుపతి, వెంకటేష్, రమేష్, సాయి, ధనంజయ, రాజు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.