సీఎం సహాయనిధి చెక్కులు ఇంటింటింకి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్

Published: Friday January 21, 2022
జగిత్యాల, జనవరి, 20 (ప్రజాపాలన ప్రతినిధి): వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎంసహాయనిధి నిమిత్తం దరఖాస్తు చేసుకున్న 14 మంది లబ్ధిదారులకు సుమారు 6.20 లక్షల విలువగల మంజూరైన చెక్కులను పట్టణంలోని 01, 04, 06, 07, 12, 15, 20, 40 వివిధ వార్డులలో నేరుగా ఇంటింటింకి వెళ్లి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు కొలగాని ప్రేమలత సత్యం, వల్లెపు రేణుక మోగిలి, కుసరి అనిల్, క్యాదాసు నవీన్, తోట మల్లికార్జున్, అవారి శివకేసరి బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావ్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.ed