లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడి ని పరామర్శించిన చెన్నయ్య

Published: Wednesday January 19, 2022
హైదరాబాద్ 17 జనవరి ప్రజాపాలన ప్రతినిధి : రాజ్ కుమార్ జాదవ్ ను పరామర్శించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. లంబాడీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. రాజ్ కుమార్ జాదవ్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఆసుపత్రి కి వెళ్లి పరామర్శించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్ ను సోమవారం నాడు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాజ్ కుమార్ కు త్వరలోనే కోలుకుంటారని ఆత్మ స్థైర్యాన్ని నింపారు.