సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది
Published: Thursday June 30, 2022
మేడిపల్లి, జూన్29 (ప్రజాపాలన ప్రతినిధి)
ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరంలాంటిదని రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జొత్స్నానాగేశ్వరావు
పేర్కొన్నారు. రామంతాపూర్ నివాసులైన వెంపటి వీరాంజనేయులు,
వెంకట కాశేశ్వర్ లకు సీఎం సహాయనిధి నుండి మంజూరైన రూ 60 వేలు రూపాయలు చెక్కులను లబ్దిదారులకు మాజీ కార్పొరేటర్ గంథం జొత్స్నానాగేశ్వరావు చెతులమీదగా అందజేశారు.ఈ సందర్భంగా మాజీకార్పోరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.పార్టీలకు అతీతంగా నిరుపేదలకు అండగా నిలుస్తూ సహకారం అందిస్తున్న సీఎం
కేసీఆర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: