ప్రభుత్వ పథకాల్లో ఫోటోగ్రాఫర్లకు ప్రాధాన్యత కల్పించాలి

Published: Friday November 18, 2022

మధిర  నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఫోటోగ్రాఫర్లకు ప్రాధాన్యతను ఇవ్వాలని మండల ఫోటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షురాలు అంగడాల పార్వతి కోరారు. గురువారం మండల పరిధిలోని ఆత్కూరు అబ్బూరి వారి మామిడి తోటలో ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక రుణాలు ఇవ్వాలని ఆమె కోరారు. అనంతరం నూతన యూనియన్ ధరల పట్టికను ఆవిష్కరించారు.   ఈ కార్యక్రమంలో మధిర మండల యూనియన్ సభ్యులు ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.