రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు చిరు కానుక
Published: Friday May 07, 2021
పరిగి, మే 6, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ( రంజాన్ ఈద్-ముబారక్ ) పండగ ఒకటి అన్ని జడ్పీటీసీ నాగి రెడ్డి అన్నారు. పండగ ఈ నెల 14 తేదీన ఉండటం వలన ఈ పండగను పునస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేస్తుందని సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు దోమ మండలం కు 250 కిట్లు వొచ్చాయని పేద ముస్లిం కుటుంబాలను ఎంపిక చేసి ఇవ్వాలని రెవిన్యూ అధికారులకు సూచించారు స్థానికంగా ఉన్న ముస్లిం నాయకులు మత పెద్దలు కూడా సహకరించి పేదలకు మాత్రమే అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా ఉప సర్పంచ్ లు గోపాల్. రఫీ. వార్డ్ సభ్యులు లక్ష్మణ్. మైను.గౌస్. సదర్ ఉమర్ డ్యూపీటీ తహసీల్దార్ రాజేందర్ రెడ్డి ఆర్ఐ రాజేందర్, తెరాస నాయకులు ఆంజనేయులు. ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: