న్యాయం కావాలంటూ ఒక మహిళా న్యాయవాది ఆవేదన... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
Published: Wednesday September 28, 2022
తమ తల్లిదండ్రులకు చెందిన ప్రాపర్టీని మొత్తం తన సోదరుడు అక్రమంగా ఆక్రమించుకున్నాడని తనకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ని వేడుకున్నారు సుప్రీం కోర్టు అడ్వకేట్ ఎం ఎస్ ఫాతిమా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడుతూ ఇదే విషయమై హైకోర్టు లో, హ్యూమన్ రైట్స్ కమీషన్ ను సంప్రదించానని,తన సోదరిని కూడా తన సోదరుడు తాను సంరక్షిస్తున్నానని చెప్తూ కనీస వైద్యం చేయించట్లేదని తన సోదరికి తక్షణమే మంచి వైద్యం అందించాలని, తన తల్లిదండ్రుల ఆస్తులను అక్రమంగా తనపరం చేసుకున్న సోదరుడిని కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Share this on your social network: