ఆర్టిసి బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని వినతి

Published: Wednesday February 17, 2021

వలిగొండ ప్రజాపాలన మండలంలోని సంగెం గ్రామానికి కరోనా కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని యాదగిరిగుట్ట ఇంచార్జీ డిపో మేనేజర్ సైదులుకు ఆ గ్రామ సర్పంచ్ కీసర రాంరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ బస్సు సౌకర్యం లేక కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల పడుతున్నారని, బస్సును పునరుద్ధరించి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాసుల కృష్ణ, బండిగారి వెంకటేశ్, జక్కల నరేష్ తదితరులు ఉన్నారు.