బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ద్వంసం చేసిన దుండగులను కఠినంగ శిక్షించాలి -మహనీయుల విగ్ర

Published: Thursday November 03, 2022
చేవెళ్ల నియోజకవర్గం (బ్యూరో)ప్రజా పాలన
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో మధ్యాహ్న సమయంలో రేవులపల్లి గ్రామానికి చెందిన మున్నూరు కాపు కులానికి చెందిన రఘు S/o నల్లారెడ్డి అనే వ్యక్తి మంగళవారం మధ్యాహ్న సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ తల భాగాన్ని పూర్తిగా ద్వంసం చేయడం జరిగిందాని దోషులను కఠినంగా శిక్షించాలని**కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ శంకర్పల్లి మండల ఇన్చార్జ్** డిమాండ్ చేశారు.శంకర్ పల్లి మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని  శంకర్పల్లి స్థానిక గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన అనంతరం. *కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ* మాట్లాడుతూ అక్కడ కొంతమంది వ్యక్తులు ప్రత్యక్షంగా వీడియో తీయడం జరిగిందాని అంబేద్కర్ విగ్రహంను ధ్వంసం చేసిన సైకో రఘురెడ్డి ని కఠినంగా శిక్షించాలని పోలీసు యంత్రంగాని డిమాండ్ చేశారు.భారతదేశంలో బాబాసాహెబ్, మహనీయుల విగ్రహాలకు రక్షణ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ విగ్రహలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని.రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గండయ్య.ప్రధాన కార్యదర్శి శివశంకర్. సీనియర్ నాయకులు  లక్ష్మయ్య.నర్సింలు.శ్రీనివాస్. ఎంఎస్ఎఫ్ నాయకులు వంశీ.మనోజ్.తదితరులు పాల్గొన్నారు.