జిల్లా ఉపాధ్యక్షుడిగా సుమన్ గౌడ్ నియామకం

Published: Monday October 18, 2021

కొడిమ్యాల, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండలం నమిలి కొండ గ్రామంకు చెందిన మంద సుమన్ గౌడ్ ను తెలంగాణ సంక్షేమ బి సి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించటం జరిగింది. ఈ నియామక పత్రాన్ని జిల్లా అద్యక్షులు గాజుల నాగరాజు, బి.సి.సర్పంచుల పోరమ్ అద్యక్షులు సామంతుల ప్రభాకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బిసి ఐక్యతకు కృషి చేస్తామని అన్నారు. ఈ నియామకానికి సహకరించి బిసి నాయకులకు కృతఙ్ఞతలు సుమన్ గౌడ్ తెలిపారు. జిల్లా యూత్ కార్యదర్శి మహిపాల్, బిసి మండల అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కడకుంట్ల శోభన్, పట్టణ అధ్యక్షులు కొప్పుల శ్రీకాంత్, గజ్జల కర్ణ చారి, ఏరోజు శ్రీనివాస్ చారి, చిలువేరి నారాయణ గౌడ్, మచ్చ రాజు, కొల్లాపురం రమేష్, గంగా చారి రంగు శ్రీకాంత్ గౌడ్, చల్ల శ్రీనివాస్ రంగినేని బాలకృష్ణ, నీలం బాలకృష్ణ మరియు నాయకులు పాల్గొన్నారు.