ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి

Published: Monday April 03, 2023
జన్నారం, ఏప్రిల్ 02, ప్రజాపాలన:  బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతిని జన్నారం మండల గౌడ సంఘము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మండల గౌడ సంఘము అధ్యక్షుడు మూల భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాది కారం సాధించేందుకే గోల్కొండ రాజులతో పోరాటం చేసి గెలుపొందిన తర్వాత గోల్కొండ ప్రాంతాన్ని పాలించడానన్నారు. పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ను ప్రభుత్వం  పాఠ్యoశo లో చేర్చడమే గాకుండా ట్యాంక్ బండ్ పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం వైస్ ఉపాధ్యక్షుడు తనుగుల చిన్నా గౌడ్, బూమగౌడ్, ముఖ్యసలహా దారులు తిరుమల అంజాగౌడ్, గాజుల లింగాగౌడ్, పోనకల్ గౌడ సంఘం అధ్యక్షుడు బూర గడ్డ శంకరయ్య, కొండ లక్మాన్,   మల్లికార్జున్, వెంకగౌడ్, రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.