సైదులు నాయక్ ని సన్మానించిన గిరిజన నాయకులు..
Published: Wednesday October 19, 2022
కొనిజర్ల, అక్టోబర్ 18 (ప్రజా పాలన న్యూస్):
తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బాధావత్ సైదులు నాయక్ ని కొణిజర్ల మండల కేంద్రం సమతా స్కూల్ ప్రాంగణంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొనిజర్ల గ్రామ సర్పంచ్ సూరంపల్లి రామారావు, తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ మాతృ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్, మనసు నాయక్ గిరిజన సంఘం కొనిజర్ల మండలం అధ్యక్షుడు తేజావత్ కృష్ణకాంత్ నాయక్, నాయకులు వాంకుడోత్ వీరన్న, బానోత్ సైదా, వ్యవసాయ కమిటీ మాజీ డైరెక్టర్ బాలు నాయక్, బానోతు వినీల్ రాజ్ మంగ్య నాయక్, లకావత్ జవహర్లాల్ పాల్గొన్నారు.
Share this on your social network: