సాకి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday April 29, 2021

పటాన్ చేరు, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : సుమారు 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్ చేరు పట్టణంలోని సాకి చెరువు వద్ద చేపడుతున్న సుందరీకరణ పనులను స్థానిక శాసనసభ్యులు గూడెంమహిపాల్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎండీఏ నుండి పది కోట్లు, జిహెచ్ఎంసి నుండి పది కోట్ల రూపాయలు చెరువు సుందరీకరణ పనులకు మంజూరయ్యాయని అన్నారు, అలాగే చెరువు కట్టపై 40 ఫీట్ల విస్తీర్ణంతో  రోడ్డు, డివైడర్, హైమాస్ట్ లైట్లు, వాకింగ్ ట్రాక్, పార్కు, కూర్చునేందుకు బల్లలు, సెంట్రల్ లైటింగ్, గార్డెనింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వివిధ శాఖల అధికారులు,  టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రమోద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.