బీజేపీ విజయ సంకల్పసభను విజయవంతం చేయండి ప్రవేశ్ సింగ్
Published: Saturday July 02, 2022
ఈ నెల 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని
బీజేపీ ఇండస్ట్రియల్ సెల్ జాయింట్ కన్వీనర్ ప్రవేశ్ సింగ్ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరగడం శుభ పరిణామమని, వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పర్వేసింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ కు వివిధ రాష్ట్రాల నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరౌతున్న నాయకులతో పార్టీలో కదనోత్సాహం కనిపిస్తోందన్నారు. ఈ నెల 3వ తేదీన జరిగే విజయ సంకల్ప సభకు వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికే బాధ్యత పార్టీ ప్రవేశ్ సింగ్ కు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిజెపిలో నూతనోత్సాహం నిండుతోందని, వచ్చే ఎన్నికలలో విజయానికి ఇది నాంది అని అన్నారు. మీడియాతో మాట్లాడిన వారిలో ప్రవేశ్ సింగ్ తో పాటు, రంగారెడ్డి జిల్లా కిసాన్మోర్చా వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, రంగారెడ్డి జిల్లా బొంగు రవి గౌడ్, ఓరుగంటిశ్రీనివాస్ గౌడ్, గుండ్ల అశోక్ బోధన్ అశ్విన్ కుమార్, తోట వెంకటనారాయణ, రవి ఆనంద్, నరసింహారెడ్డి వున్నారు. కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్ మాట్లాడుతూ మోడీ సభను సక్సెస్ చేయాలని కోరారు.
Share this on your social network: