మున్సిపల్లోని పెండింగ్ పనులు పూర్తిచేయాలి

Published: Thursday August 19, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 18 ఆగస్ట్ ప్రజాపాలన : మున్సిపల్ పరిధిలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సూచించారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు అధికారులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్, హరితహారం, అండర్ డ్రైనేజీ మొదలగు వాటిపై చర్చించారు. గతంలో ఎమ్మెల్యే సూచించిన పనులు ఎంతవరకు సఫలీకృతం అయ్యాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పనులు నిరంతరం కొనసాగాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తదుపరి జరగాల్సిన పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, డిప్యూటి ఈఈ రామ్ కిషన్, టిపిఓ శ్రీధర్, ఏఈ రాయుడు, టిపిఎస్ వేణు గోపాల్, అకౌంటెంట్ మాధురి, ఆర్ఓ శివ కుమార్, హెల్త్ ఇన్ స్పెక్టర్ యేసుదాస్, మెప్మా సెక్షన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.