ఊరూరా ప్రచారం చంద్రశేఖర్

Published: Thursday September 30, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 07 వరకు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నిర్ణయించింది నరేంద్రమోడీ గారు 13 సం లు గుజరాత్ ముఖ్యమంత్రిగా మరియు 7 సం ప్రధానమంత్రిగా మొత్తం 20 సం లుగా సేవాలందిస్తునందున 20 రోజులు సేవ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించారు. దీనిని సేవ సప్తహ కార్యక్రమాలుగా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నరేంద్రమోడీ ఒక రోజు 2 కోట్ల50 లక్షల వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అంతేకాక ఆర్టికల్ 370, రామాజన్మ భూమి, త్రిబుల్ తలక్ లాంటి వాటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగా ఏలే చంద్రశేఖర్, నరేంద్రమోడీ సంక్షేమ పథకాలను ఊరు ఊరు ప్రచారం నిర్వహించటానికి ప్రతి మండలానికి జిల్లా వ్యాప్తంగా ప్రచారం సాగిస్తున్నారు.భువనగిరి యాదాద్రి జిల్లాలో ఈ నెల 25 వ తేదీన పివి శ్యామసుందర్ రావు భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా వలిగొండ మండలంలో ప్రచారానికి వచ్చిన ప్రచార రథానికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దంతురి సత్తయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు బంధారపు లింగస్వామి, ఉపసర్పంచ్ మత్స్యగిరి, మండల అధ్యక్షుడు నాగేలి సుధాకర్, బచ్చు శ్రీను, మైసోళ్ల నర్సింహ, పిట్టల అశోక్, మాటూరి కృష్ణ, దయ్యాల వెంకటేశం, మైసోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.