భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో"మజ్జిగ పంపిణీ

Published: Friday April 29, 2022

మధిర ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మెయిన్ రోడ్ లోగల"భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి" జిల్లా బాధ్యులు శ్రీ కోనా మోహన్ రావు  ఆధ్వర్యంలో మధిర పట్టణం మెయిన్ రోడ్డు నందు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి  దేవాలయం ఆవరణ నందు గత నెల రోజుల నుండి  వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బాటసారులకు "మజ్జిగ" పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈరోజు 30వ రోజు సందర్భంగా ఆహ్వానం మేరకు మధిర సేవా సమితి కమిటీ సభ్యులు పల్లపోతు ప్రసాదరావు, మిర్యాల కాశీ విశ్వేశ్వర రావు, ప్రారంభించి పంపిణీ చేసినారు ఈ సందర్భంగా కోనా మోహన్ రావు మాట్లాడుతూ వచ్చే 30 రోజులలో కూడా వేసవి తాపానికి పాదచారులకు స్వామి వారి ఆశీస్సులతో మజ్జిగ పంపిణీ చేపడతామని తెలిపారు మరియు పల్లపోతు ప్రసాద రావు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి పద్మ సేవలందించారు