డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులందరికి చెందాలి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Friday March 03, 2023

జగిత్యాల, మార్చి 02 (ప్రజపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లు అర్హులైన ప్రతి బీద కుటుంబానికి చెందాలని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ప్రభుత్వం ప్రతి బీదవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు రాని ఎడల ప్రతి ఆడబిడ్డ కన్నీరు కార్చిన ఆ ఉసురు మీ ప్రభుత్వనికి తగులుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 450 రూపాయల ఉన్న ధర బీజేపీ పాలనలో1250 ధరకు చేరిందని ఇదేనా సుపరిపాలన అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం తాటిపర్తి విజయలక్ష్మి బండ శంకర్ కొత్త మోహన్ గాజుల రాజేందర్ కల్లెపల్లి దుర్గయ్య సిరాజోద్దీన్ రాగ్వీర్గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరలు పాల్గొన్నా